ఇస్లాంలో ప్రవక్తత్వం

సర్వలోకాలను మరియు వాటిలోని ప్రతిదాన్నీ సృష్టించిన అల్లాహ్ మానవులను ఒక ఉత్తమ ఉద్దేశ్యంతో సృష్టించినాడు: అదేమిటంటే ‘కేవలం ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఆయన యొక్క దివ్య బోధనలు మరియు మార్గదర్శకత్వాన్ని అనుసరించి సద్గుణాలతో కూడిన నైతిక జీవితం గడపాలి’. మరి, మానవులు ఆయన నుండి స్పష్టమైన మార్గదర్శకత్వం పొందకుండా దీనిని పూర్తి చేయలేరు కదా!

అంతేగాక, అత్యంత దయామయుడు మరియు న్యాయవంతుడైన అల్లాహ్ ఏ లక్ష్యం లేకుండా భూమిపై ఎలా పడితే అలా జీవించమని మనల్ని వదిలివేయలేదు. అందుకనే అల్లాహ్ మన జీవిత ఉద్దేశ్యాన్ని మనకు తెలిపేందుకు సమాజంలో నుండి కొందరు పుణ్యపురుషులను ఎంచకుని, వారిపై తన దైవవాణి అవతరింపజేసినాడు. దానిని స్వయంగా ఆచరించి మానవాళికి చూపమని వారిని ఆదేశించాడు.

01

ఆ పుణ్యపురుషులనే ప్రవక్తలు అంటారు, వారిలో కొందరి పేర్లు – ఆదమ్, నూహ్, అబ్రహామ్, మోసెస్, జీసస్ అలైహిస్సలాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్తల ప్రత్యేక లక్షణాలు ప్రవక్తలందరు కొన్ని కామన్ లక్షణాలు కలిగి ఉండేవారు. వాటి ద్వారా వారి కాలంలోని మానవులలో ప్రవక్తలు అసాధారణమైన వారిగా గుర్తించబడినారు.

02

ప్రవక్తలు దివ్యవాణి అందుకునేవారు సామాన్య మానవుడికి మరియు ప్రవక్తకు మధ్య గల ముఖ్యమైన భేదం ఏమిటంటే ప్రవక్తపై అల్లాహ్ నుండి దివ్యసందేశం అవతరిస్తుంది. ప్రవక్తలు ఉత్తమ లక్షణాలు కలిగి ఉండేవారు ప్రవక్తలు సంపద, హోదా, అధికారం మొదలైన వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఎంతమాత్రమూ ప్రయత్నించేవారు కాదు.

03

కేవలం అల్లాహ్ ఆమోదం మరియు ప్రసన్నత పొందాలని మాత్రమే చూసేవారు. స్వభావం మరియు సద్గుణాలలో ప్రవక్తలను వారి ప్రజలు ఉత్తములుగా గుర్తించేవారు. వారు ఉత్తమ నైతిక ప్రవర్తన కలిగి ఉండి, ఎల్లప్పుడూ తమ పలుకులలో మరియు ఆచరణలలో సత్యవంతులుగా ఉండేవారు.

అందువలన, ఇతర ధర్మాల కొన్ని ప్రాచీన గ్రంథాలలో పేర్కొన్నట్లుగా ప్రవక్తలు కూడా ఘోరపాపాలకు పాల్బడవచ్చనే అసత్య వాదనను ముస్లింలు పూర్తిగా తిరస్కరిస్తారు.

ప్రవక్తలు కొన్ని మహిమలు మరియు అద్భుతాలు ప్రదర్శించారు అనేక మంది ప్రవక్తలు వారి ప్రజలు నైపుణ్యం పొందిన రంగంలోనే మహిమలు, అద్భుతాలు ప్రదర్శించారు. ఉదాహరణకు, ప్రవక్త మోసెస్ అలైహిస్సలాం కాలపు ప్రజలు మ్యాజిక్ అంటే ఇంద్రజాలంలో ప్రసిద్ధి చెందారు.

కాబట్టి, అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్త మోసెస్ అలైహిస్సలాం ప్రదర్శించిన ఇంద్రజాల అద్భుతాలను ఆ తాంత్రికులు చేయలేక పోయారు. ప్రవక్త జీసస్ అలైహిస్సలాం మెడిసిన్ లో తన ప్రజలందరినీ మించి పోయారు. తద్వారా, తన ప్రజలలోని సుప్రసిద్ధ వైద్యులు చికిత్స చేయలేని వ్యాధులను కూడా ఆయన అల్లాహ్ ఆజ్ఞతో అద్భుతంగా నయం చేయగలిగినారు.

అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలు అరబీ కవిత్వంలో ప్రసిద్ధి చెందినారు. కాబట్టి ఏ కవీ పోటి పడలేనంత అత్యుత్తమ సాహిత్యంతో ఆయనపై ఖుర్ఆన్ దివ్యగ్రంథం అవతరించింది. ఇంకా, అనేక మంది ప్రవక్తలు జరగబోయే సంఘటనల గురించి సత్యమైన భవిష్యవాణులు వినిపించారు. ఈ మహిమలు, అద్భుతాలన్నీ అల్లాహ్ అనుజ్ఞతో మాత్రమే జరిగాయి.

తద్వారా వారు కూడా మానవులే గానీ వారికి దైవత్వంలో ఎలాంటి భాగస్వామ్యం లేదని నిరూపించబడింది. ప్రవక్తలు దేవుళ్ళు కాదు అంటే ప్రవక్తలకు దైవత్వంలో ఎలాంటి భాగస్వామ్యం లేదు.

ప్రవక్తలను వారి ప్రజలలో నుండి స్వయంగా అల్లాహ్ ఎంచుకున్నాడు. వారిలో ఎలాంటి దైవత్వమూ లేదు. వారిలో ఆరాధింపబడటానికి కావలసిన అర్హతలు, యోగ్యతలు లేవు. ఇలా ప్రకటించమని అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆదేశించబడింది, “నేను కూడా మీవంటి మానవుడిని మాత్రమే. మీ ప్రభువు ఏకైకుడని నాకు దివ్యవాణి ద్వారా తెలుపడింది.

” ఖుర్ఆన్ 18:110 ప్రవక్తలు దేవుళ్ళు కారని, వారు కూడా ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ నే ఆరాధించేవారని మరియు అల్లాహ్ కే సాష్టాంగపడేవారని పాతనిబంధనలు మరియు కొత్తనిబంధనలు రెండింటి ద్వారా బైబిల్ లో స్పష్టంగా పేర్కొనబడింది.

“మరియు ఆయన (జీసస్) కొంచెం ముందుకు పోయి, సాగిలపడి, ప్రార్థించెను …” మత్తయి సువార్త 26:39 “అపుడు వారు (మోసె, అహరోహనులు) సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడమైన దేవా, యీ యొక్కడు పాపము చేసినందున సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి” సంఖ్యాకాండము 16:22 “అబ్రాము సాగిలబడియుండగా, దేవుడతనితో మాట్లాడి ....

…” ఆదికాండము 17:3 ప్రవక్తలు ఆవశ్యకమైన అర్హతలు కలిగి ఉండేవారు వారికి అప్పజెప్పబడిన మిషన్ ను విజయవంతంగా పూర్తిచేసేందుకు అల్లాహ్ ప్రవక్తలందరికీ నిలకడ, ధైర్యసాహసాలు, నాయకత్వం, సహనం మరియు వివేకం మొదలైన కొన్ని ప్రత్యేక లక్షణాలు ప్రసాదించాడు.

కొన్ని ఉదాహరణలు : • కేవలం కొద్దిమంది మాత్రమే తన పిలుపు స్వీకరించినా, అధైర్యపడకుండా నిరంతరం తన ప్రజలను అల్లాహ్ వైపు పిలిచిన నూహ్ అలైహిస్సలాం యొక్క చలించని నిలకడతనం. • అసత్య విశ్వాసాల విషయంలో పిన్నవయసులోనే ఒంటరిగా తన మొత్తం సమాజాన్ని ఎదుర్కొన్న ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క గొప్ప ధైర్యసాహసాలు.

• తన కాలపు అత్యంత దౌర్జన్యపరుడు, క్రూరుడైన ఫిరౌను చక్రవర్తి బారి నుండి ప్రజలను కాపాడిన మూసా అలైహిస్సలాం యొక్క సాటిలేని నాయకత్వం. • తన ప్రజలు పెట్టిన కష్టాలను మరియు హింసలను ఎంతో ఓర్పుతో సహించిన జీసస్ అలైహిస్సలాం యొక్క గొప్ప సహనశక్తి.

• ఎల్లప్పుడూ పరస్పర యుద్ధాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉండిన అరేబియా ద్వీపకల్పంలోని అనేక ప్రత్యర్థి తెగలను విజయవంతంగా ఒకే త్రాటిపై తీసుకు వచ్చి, ఒక ప్రశాంత సమాజాన్ని స్థాపించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప వివేకం.

ప్రవక్తల సందేశం “వాస్తవానికి మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము (ఆయన ఇలా ప్రకటించాడు): ‘మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి మరియు మిథ్యాదైవాల ఆరాధనను త్యజించండి.’ ఖుర్ఆన్ 16:36 మొత్తం ప్రవక్తలందరినీ ఏకైక నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ యే పంపడం వలన, వారందరూ ఒకే సందేశాన్ని అందజేసారు.

ఇంకా, జీవిత ఉద్దేశ్యాన్ని తమ ప్రజలకు జ్ఞాపకం చేసే ఒకే మిషన్ కొరకు పనిచేసినారు. వారి ఆ దివ్యసందేశం మరియు మిషన్ ఏమిటంటే : • నిజమైన దైవభావన గురించి స్పష్టం చేయడం మరియు అసత్య విశ్వాసాలను తిరస్కరించడం. • నిజమైన జీవిత ఉద్దేశ్యాన్ని బోధించడం. • అల్లాహ్ ను ఎలా ఆరాధించాలో స్వయంగా ఆచరించి చూపడం.

• ప్రజలకు సుద్గుణ మరియు దుర్గుణ అంటే మంచి - చెడు స్వభావం గురించి అల్లాహ్ యొక్క నిర్వచనాన్ని అందజేయడం మరియు దాని గురించి ప్రజలకు ఉత్తమ సలహాలు ఇవ్వడం. • అల్లాహ్ కు విధేయత చూపడం వలన లభించే మంచి ప్రతిఫలం (స్వర్గం) గురించి వివరించడం మరియు అల్లాహ్ కు అవిధేయత చూపడం వలన ఎదుర్కోబోయే కఠిన శిక్షల (నరకం) గురించి హెచ్చరించడం.

• ఆత్మ, దైవదూతలు మరియు దయ్యాలు, పరలోక జీవితం మరియు విధివ్రాత మొదలైన విషయాలలోని అపార్థాలను దూరం చేయడం. “మరియు మేము ప్రతి ప్రవక్తను అతని జాతి వారి భాషలోనే పంపాము.

అతను వారికి స్పష్టంగా బోధించటానికి …”ఖుర్ఆన్ 14:4 మొత్తం ప్రవక్తలందరు అసలు దైవభావన గురించి స్పష్టం చేయడంపైనే ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించేవారు: ఎవ్వరూ ఆయనకు సాటి లేరు, భాగస్వాములు లేరు, సమానులు లేరు. అరాధనలన్నీ కేవలం ఆయనకు మాత్రమే చెందుతాయి.

ప్రవక్తలు ఈ సందేశాన్ని అందజేసారనే ఉపమానాలు ఖుర్ఆన్ లో ఎన్నో ఉన్నాయి: ప్రవక్త నూహ్ అలైహిస్సలాం ఇలా పిలిచారు, “ఓ నా ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి! ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు.” [ఖుర్ఆన్ 7:59] ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇలా పిలిచారు, “మీరు అల్లాహ్ ను వదలి, మీకెలాంటి లాభం గానీ నష్టం గానీ చేకూర్చలేని వాటిని ఆరాధిస్తారా?

” [ఖుర్ఆన్ 21:66] ప్రవక్త మూసా అలైహిస్సలాం ఇలా పిలిచారు, “ఏమీ! నేను అల్లాహ్ ను వదలి మరొక ఆరాధ్య దైవాన్ని మీ కొరకు అన్వేషించాలా ? వాస్తవానికి ఆయనే సర్వలోకాల వారిపై మీకు ఘనతను ప్రసాదించాడు” [ఖుర్ఆన్ 7:140] ప్రవక్త జీసస్ అలైహిస్సలాం ఇలా పిలిచారు, “నిశ్చయంగా అల్లాహ్ నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. కావును మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గం.

” [ఖుర్ఆన్ 3:51] అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు, “నిశ్చయంగా మీ ఆరాధ్యుడు ఆ ఏకైక దైవం (అల్లాహ్) మాత్రమే నని నాపై దివ్యవాణి అవతరింపజేయబడింది. కాబట్టి తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా కల్పించుకోరాదు.

” [ఖుర్ఆన్ 18:110] ఇదే సందేశం తరతరాలుగా ఇవ్వబడింది. మరియు సృష్టికర్త పై సరైన దైవవిశ్వాసం కలిగి ఉండవలసిన ప్రాధాన్యత గురించి నొక్కి చెప్పబడింది.

ఇస్లాం గురించి తెలుసుకోండి

సత్యాన్ని కనుగొనండి

మరింత తెలుసుకోండి

సత్యం వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి